ఆశా కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కొసం సీఐటీయూ పిలుపు మేరకు నేడు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద మహాధర్నా కు పిలుపు ఇవ్వడం తో జుక్కల్ పోలీసులు ఆశా ముఖ్య కార్యకర్తలకు ఉదయం ముందస్తు అరెస్టు చేశారు.
తమ న్యాయమైన డిమాండ్లను నెరేవేర్చలని వారు శాంతి పూర్వకంగా నిరసన తెలుపుతుంటే వారిని అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని సీఐటీయూ డివిజన్ కన్వీనర్ సురేష్ గొండ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో పుష్ప గౌడ్, గంగమణి, శ్రీదేవి, సులోచన, సురేఖ, ఇందిరా, భారతి తదితరులు ఉన్నారు.