ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా నిర్వహించే బోనాల పండుగ జాతర ఎల్లమ్మ తల్లి దేవాలయంలో వైభవోపేతంగా నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 23వ,వార్డు లోని ఫైర్ స్టేషన్ సమీపంలోని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా బోనాలు సమర్పించారు. ముందుగా మేళతాళాలతో, ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి తొలి బోనాన్ని 23వ,వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య దంపతులు సమర్పించారు.
ఈ సందర్భంగా జక్కుల వీరయ్య మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి గ్రామ ప్రజలను చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలతో,పాడి,పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని,కరోనా మహమ్మారి ప్రజల దరిచేరకుండా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరారు.ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అన్నారు. అనంతరం భక్తులు తమ మొక్కుబడులను అమ్మ వారి సమక్షంలో తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో నెలమదిటి వెంకటేశ్వర్లు,వర్ధనమ్మ,ఉపేందర్, కొమ్ము రాములు,గురుప్రసాద్, గొల్లగోపు వెంకన్న, పున్న, శ్రీనివాస్, నాగరాజు, సూర్యనారాయణ,రాంబాబు,బద్రి, వీరస్వామి,నరసింహారావు, రమేష్, 23వ, వార్డు కాలనీ వాసులు,విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్