ఉత్తరాంధ్ర పట్ట భద్రుల ఎమ్మెల్సీగా అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ కి చెందిన భీమిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంఏబీఈడీ చేసిన చిన్నికంమారి లక్ష్మి నిలుచున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరం కు వచ్చిన ఆమె అశోక్ బంగ్లా లో విలేకరులతో మాట్లాడారు. ఎంఎల్ఏగా..ఎంపీ రాష్ట్ర మంత్రి గా కేంద్ర మంత్రి గా పని చేసిన మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు… ఎన్నో వేల ఎకరాలను… ప్రజల కోసం ధారాదత్తం చేసారని చిన్ని కుమారి లక్ష్మీ గుర్తు చేసారు. ఎంఎల్సీగా నిలుచున్న నాకు ఆయన ఆశీస్సులు ఉండిలని కోరుతూ మీడియా ముందే ఆయన కాళ్ళ కు నమస్కరించేందుకు ముందు కు వంగారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చదువు కున్న వ్యక్తి చట్ట సభలలో ఉంటే… సమాజం సహజంగా అభివృద్ధి పధంలో కి నడుస్తుందన్నారు. వచ్చే ఏడాది మార్చి లో జరగనున్న పట్ట భద్రుల స్థానంలో అటువంటి అభ్యర్థి నే గెలుపించుకోవాలన్నారు.ఆ ఉద్దేశ్యం తోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలు…రాజుగారి సూచనలతో నేను నిల్చుంటున్నానని ఆమె చెప్పారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ల అన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను అటు ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు… అలాగే లోకేష్ ..అశోక్ గజపతిరాజు లు తీసుకెళుతున్పారన్నారు.ఈ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నిక ద్వారా నన్ను గెలిపించే బాధ్యత మన టీడీపీ కుటుంబ సభ్యులతో పాటు ఉత్తరాంధ్ర పట్టభధ్రులందరిదీ అని ఆమె అన్నారు.