ఉదయం 8 దాటితే రోడ్ పైకి రావాలంటే ప్రతీ ఒక్కరూ జంకుతున్నారు.. అంతలా భానుడు భగభగమని మంటపెడుతున్నారు.గత్యంతరం లేక ఉద్యోగం కోసం….కుటుంబం కోసం వెళ్లాల్సిన వచ్చిన వారు వెళ్లకతప్పటం లేదు. కానీ …మాడు పగిలే ఎండలో అంటే ఉదయం 8 కాకుండా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎవ్వరనా బయట అడుగు పెడతారా..? సరిగ్గా అదే పని చేశారు… టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.
అదీ సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా. పార్టీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తాను కేంద్ర మంత్రి ఉన్న సమయంలో.. చెల్లూరు నుంచీ గొట్లాం వరకు వేసిన జాతీయ రహదారి అందుబాటులో కి వచ్చిందని… అదీ తన హాయాంలో అప్పటి కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హయాంలో మంజూరు అయ్యిందని అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా చెల్లూరు రోడ్ లోనే మీడియా చెప్పారు.
అదీ సెల్ఫీ తీసుకుని…సోలార్ ఎనర్జీ ని టీడీపీ తీసుకొచ్చిందని ఘపనా స్థలి నుంచీ సెల్ఫీ తీసి అక్కడే మీడియా తో మాట్లాడటం విశేషం. అంతకు ముందు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్ఠికర్త..రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా విజయనగరం జిల్లా టీడీపీ కంచుకోట అయిన అశోక్ బంగ్లాలో సందడి వాతావరణం నెలకొని ఉంది.
ఈ సందర్భంగా పార్టీ నేతలు… పెద్ద ఎత్తున జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో తెలుగు తమ్ముళ్లు… కేక్ కట్ చేశారు. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు… సుమారు 70 వేలు విరాళం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు రాజు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరిలో సేవా భావం అలవడాలన్నారు.పార్టీ అధినేత పుట్టిన రోజు సందర్భంగా అనాధ పిల్లలకు చేయూత నివ్వడం ఓ సువర్ణవకాశంగా భావిస్తున్నానన్నారు.
ఈ భావనే ప్రతీ ఒక్క రిలో రావాలి… కలగాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఐవీపీ రాజు ,పార్టీ నగర నేతలు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్, కనకల మురళి మోహన్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ప్రసాదుల కనకమహలక్ష్మి ,50 వ డివిజన్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.