జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ గా పసుపునూరి అశోక్ నంద ను నియమించారు. ఈ మేరకు సంస్థ ఫౌంటర్ చైర్మన్ ఎంఎల్ నాగేశ్వరరావు నియామక పత్రాన్ని అందచేశారు. జాతీయ వైస్ చైర్మన్ బలగం పూర్ణచందర్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ జి మహేందర్ యాదవ్ పసుపునూరి అశోక్ నంద ను నియమిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పసుపునూరి అశోక్ నంద మాట్లాడుతూ తనపై నమ్మకముంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పిన NCRC సభ్యులకి, సహకరించిన మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి వినియోగదారుల హక్కులకై నిరంతరం కృషి చేస్తూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, కమిషన్ కు మంచి పేరు తీసుకొస్తానని అన్నారు.