ఉత్తరాంధ్ర లో టీడీపీ కి ఆయనే పెద్ద దిక్కు.అటు పార్టీ పరంగా, ఇటు వ్యక్తి గతంగా అలాగే రాజకీయ కురువృద్ధుడు గా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు ఈ నెల 26. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆయన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలని పార్టీ నగర శాఖ నిర్ణయించింది.
ఈ మేరకు కార్యక్రమం వివరాలను కూడా తెలియపరిచారు. ఈ మేరకు ఆయన బిడ్డ.. విజయనగరం ఇంచార్జి ఆదితీ గజపతిరాజు ఆద్వర్యంలో టీడీపీ నగర శాఖ పలు కార్యక్రమాలను రూపొందించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు జన్మదినం (26వ తేదీ) సందర్బంగా విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇంచార్జ్ అదితి గజపతి రాజు పర్యవేక్షణలో 25 మరియు 26వ తేదీలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పార్టీ.
ఈ నెల 25వ తేదీ నఉదయం 8.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడుతోంది. ఈ రక్తదాన శిబిరంలో అధికసంఖ్యలో రక్తదాతలు పాల్గొనాలని పార్టీ కోరుతోంది. ఈ నెల 26వ తేదీ న పూసపాటి అశోక్ గజపతి రాజు గారి జన్మదిన వేడుకలను నిర్వహిస్తోంది.. పార్టీ.
ఉదయం 9 గంటల నుండి పూసపాటి అశోక్ గజపతి రాజు పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఇక ఉదయం 9.30 గంటలకు పేర్లవారి వీధిలో గల చెవిటి మరియు మూగ పాఠశాల విద్యార్థులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకొను కార్యక్రమం అశోక్ గారి బంగ్లా లో నిర్వహించబడుతుంది.
అదేవిధంగా ఉదయం 11.00 గంటలకు విజయనగరం నగరంలో ప్రేమసమాజమునకు వెళ్లి వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద (గతంలో అన్న క్యాంటీన్ వద్ద) తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొననున్నారు.