ఈ నెల 4వ తేదీ నుంచి తమ ధియేటర్లు ఓపెన్ చేస్తున్నట్లు ఏసియన్ సినిమాస్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ వెల్లడించారు. ఎఎంబి సినిమాస్ ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభించింది.
కరోనా కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లు ఏసియన్ సినిమాస్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ తెలిపారు.
దాదాపుగా 9 నెలల తర్వాత సినిమా ధియేటర్లు తెరుస్తున్న ఈ తరుణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.