హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో విజయం సాధించిన ములుగు జిల్లా SMA తైక్వాండో బాలురు బాలికలను ఏఎస్పీ సాయి చైతన్య అభినందించారు.
గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సుమారు యాభై మంది పిల్లలకు తైక్వాండో కోచ్ తనుగుల అనిల్ శిక్షణ ఇస్తూ ములుగు జిల్లాలో గతనెలలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి తైక్వాండో టోర్నమెంట్ లో SMA టైక్వాండో అకాడమీ పిల్లలు విజయం సాధించి రాష్ట్ర స్థాయి కి ఎంపికయ్యారు.
హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో విభిన్న స్థాయిల్లో గోల్డ్,సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ గెలుపొందారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఏఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ కోచ్ అనిల్,మెడల్స్ సాధించిన పిల్లలు ములుగు జిల్లాకు గర్వకారణమని,ఇలాగే ఇంకా ఎన్నెన్నో మెడల్స్ సాధించాలన్నారు.
కోచ్ తనుగుల అనిల్ ను శాలువాతో సన్మానించి ములుగు జిల్లా కు మంచిపేరు తీసుకు రావాలని అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు గాదం దేవేందర్ గండ్రకోట విష్ణుకుమార్ , ఐలి నాగరాజు, శంకేసి జగదీశ్వర్ చల్లగురుగుల రాజువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.