కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి (తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం) పుష్కరిణిలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నూతన బోట్ ను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక శోభను తిమ్మాపూర్ తిరుపతి క్షేత్రానికి ఏర్పాటు చేయడం ఆనందం అన్నారు. కార్యక్రమంలో స్పీకర్ తోపాటు మాజీ జెడ్పీ సభ్యులు సతీష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంబాబు, సొసైటీ చైర్మన్ అప్పారావు, ఎంపిపి రఘు కో ఆప్షన్ సభ్యులు అరీఫ్, ఎంపిటిసి సందీప్, మార్కెట్ చైర్మన్ పెరిక శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ స్వప్న, గంగారం మండల అధ్యక్షులు అశోక్ తోపాటు తిమ్మాపూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
previous post