ఈ నీచుడిని ఏ పేరుతో పిలవాలో అర్ధం కావడం లేదు….. వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో జరిగిన ఈ సంఘటన చూస్తే మీరు కూడా వీడ్ని ఏ పేరుతో పిలవాలా అని ఆలోచిస్తారు. మృగాలతో కూడా పోల్చలేం. బతుకు తెరువుకోసం హైదరాబాద్ వచ్చిన ఒక కుటుంబం పఠాన్ చెర్వు ప్రాంతంలో నివశిస్తున్నది.
తల్లి తండ్రి తో బాటు వారి ముగ్గురు కుమార్తెలు అక్కడ ఉంటున్నారు. ఆ ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె గర్భం దాల్చింది. ఎవరికి ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆ తల్లి ఈ పరిణామానికి తల్లడిల్లి కుమార్తెను నిలదీసింది. అప్పుడు….. వెల్లడైంది. కన్న కూతురు పై తండ్రి గత కొంతకాలంగా అత్యాచారం జరుపుతున్నాడని……. కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పాడాడని చెప్పింది కూతురు. దాంతో హతాశురాలైన తల్లి సొంత గ్రామం మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని మోమిన్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.