ప్రకారంజిల్లా వేటపాలెంలో మతి స్థిమితం లేని మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలోని రాధాకృష్ణాపురంలో పట్టపగలే ఈ దారుణనికి ఒడికట్టారు. ఇద్దరు యువకులు ఆ బాలిక పై అత్యాచారం చేయగా మరో ఇద్దరు యువకులు ఇంటి బయట కాపలా ఉండి వారికి సహకరించారు.
ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ముద్దాయి లను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో చీరాల డిఎస్పి శ్రీకాంత్ మాట్లాడుతూ పథకం ప్రకారం సంఘటన జరిగిందని తెలిపారు.
బుద్దిమాంద్యం కలిగిన అత్యాచారం జరిగిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెకు అనారోగ్యం కారణంగా బుధవారం ఆస్పత్రికి వెళ్లి ఉండగా నలుగురు యువకులు మధ్యాహ్న సమయంలో మైనరు బాలిక పై నాగరాజు, లక్ష్మయ్య అనేవారు అత్యాచారానికి పాల్పడ్డారు.
అనిల్, జాలి రెడ్డి అనే వారు ఇంటి బయట కాపలా ఉండి సహకరించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలుగురూ పరారు అయ్యారు. కాగా ఆ బాలిక ఏడుస్తూ బయటకొచ్చి ఇరుగుపొరుగు వారికి జరిగిన విషయం తెలిపింది.
బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.నలుగురునిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కొద్దీ గంటలలోనే ముద్దాయి లను అరెస్ట్ చేసిన వేటపాలెం SI కమలాకర్ పోలీసులను, రూరల్ సి.ఐ. రోశయ్యలను ప్రకాశంజిల్లా ఎస్. పి. సిద్ధార్థ కౌసిల్ అభినందించారు.