34.2 C
Hyderabad
April 19, 2024 21: 26 PM
Slider కరీంనగర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలికపై అత్యాచారం

minor girl raped

ఆటో డ్రైవర్ ఒకడు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల డీఎస్పీ పి.చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం గంభీరావుపేట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఈ దుర్ఘటన జరిగింది. 24 ఏళ్ల ఆటో డ్రైవర్‌ ఒకడు ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బస్సులో వెళ్లని రోజున ఆ ఆటో డ్రైవర్ ఆమెను ఆటోలో స్కూలుకి తీసుకెళుతుండేవాడు.

అలా ఆటోలో తీసుకెళ్తూ మాయమాటలు చెప్పి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినికి వాంతులు కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. పరీక్షల్లో ఆ బాలిక గర్భవతి అని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయగా.. ఆ ఆటో డ్రైవర్ బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసాడని తెలిపింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి వాడ్ని అరెస్ట్‌ చేశామని డీఎస్పీ పి.చంద్రశేఖర్‌ తెలిపారు.

Related posts

నీలం సాహ్నీపై సీరియస్ అయిన రాష్ట్ర హైకోర్టు

Satyam NEWS

సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్‌

Murali Krishna

డెడ్లీ యాక్సిడెంట్: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒకరు మృతి

Satyam NEWS

Leave a Comment