తమకు అన్యాయం జరిగిందని గొంతు చించుకుని అరుస్తున్న పంజాబ్ రైతులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులపై దాడి చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ను పోలిన సిక్కుల మత జెండాను ఎగురవేసిన ఈ ‘రైతులు’ సెంట్రల్ ఢిల్లీలో పోలీసులను దారుణంగా కొట్టారు.
రోడ్డు పై నుంచి ఉరికి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను కర్రలతో బాది ఈ ‘రైతులు’ చావగొట్టారు.
సిక్కులు సాంప్రదాయంగా వాడే కృపాణాలను తీసుకువచ్చి ప్రదర్శించిన ‘రైతులు’ పలు చోట్ల పోలీసు బ్యారికేడ్లను ధ్వంసం చేశారు.
ట్రాక్టర్లతో బ్యారికేడ్లను ధ్వంసం చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వాటర్ కెనాన్ లు, భాష్ప వాయువు ప్రయోగించిన పోలీసులు ఈ ‘రైతులను’ అదుపు చేయలేకపోయారు.