39.2 C
Hyderabad
March 29, 2024 17: 01 PM
Slider ముఖ్యంశాలు

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పడాల శంకర్‌ పై దాడి

#sfishankar

పసిపాప చైత్ర అత్యాచారాన్ని నిరసిస్తూ మేడ్చల్‌లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో  ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పడాల శంకర్‌ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పడాల శంకర్‌ ఈసీఐఎల్‌ కి వస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు  ఏఎస్‌రావునగర్‌లో దాడి శంకర్‌ పై దాడిచేశారు. 

దాడిని ఎస్‌ఎఫ్‌ఐ ఉప్పల్‌ నియోజకవర్గ అధ్యక్షులు ఖాసీంజాలం ఖండించారు. ఈ  దాడి పలు అనుమానాలకు తావిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ఉప్పల్‌ నియోజకవర్గ కమిటి అభిప్రాయపడింది. శంకర్‌ పై దాడి చేసి మొబైల్‌పోన్‌, బైక్‌ తాళం తీసుకున్నట్లు , అతని మొబైల్‌ పోన్‌లో విలువైన సమాచారం ఉండటం,  బలమైన ఉద్యమాలు నిర్మించడంలో శంకర్‌ ని ఉద్దేశ్యపూర్వకంగా దాడి జరిగిందని ఉప్పల్‌ కమిటి అభిప్రాయపడింది.

ఈ దాడిపై వెంటనే సమగ్ర విచారణ చేసి నిజ నిజాలు బయట పెట్టాలని ఉప్పల్‌ ఎస్‌ఎఫ్‌ఐ కమిటి డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో  ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరుల పాల్గొన్నారు.

Related posts

బలవంతపు రిటైర్మెంట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49 మంది పేర్లు ఇవి

Satyam NEWS

ముందస్తు అనుమతుల పేరుతో రెండు కోట్ల రూపాయలు స్వాహా

Satyam NEWS

Leave a Comment