తన ఇంటిపై దాడి జరిగిందని సిరిసిల్ల పట్టన బీజేపీ నాయకుడు గుడ్ల విష్ణు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎవరో వచ్చి, తమ ఇంటిని ధ్వంసం చేసి వెళ్లారని విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి తాను ఫంక్షన్ కి వెళ్లానని, ఆ సమయంలో వివిధ ఫోన్ నెంబర్లతో తనకి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బెదిరింపు కాల్స్ రావడంతో రాత్రి తన ఇంటికి ఫోన్ చేసి కుటుంబ సభ్యులను. తమ బంధువుల ఇంటికి వెళ్లి పడుకోవాలని చెప్పినట్లు, అలా వారు వెళ్ళాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటిపై దాడి జరిగిందని, సుమారు 50 వేల రూపాయలతో పాటు, ఆస్తినష్టం జరిగిందని కేసు నమోదు చేసి దుండగులను చట్టపరంగా శిక్షించాలని ఆయన ఫిర్యాదులో కోరారు.