రాజకీయ కక్ష్య తోనే తమ కుటుంబం పై దాడులు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. వరుసగా రెండో రోజు మల్లారెడ్డి ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కాగా మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి కి ఛాతీ నొప్పి రావటంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఐటి అధికారులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశం గా మాట్లాడారు. సూరరంలోని మల్లారెడ్డి హాస్పిటల్ కి మల్లారెడ్డి తో పాటు ఐటీ అధికారులు వెళ్లారు. ఈ సదర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కక్ష్యతో తన పై నా, బంధువుల ఇళ్ల పైనా ఐటీ రైడ్స్ చేయిస్తుందన్నారు. తన కొడుకు ను ఐటీ రైడ్స్ పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆసుపత్రి పాలయ్యాడన్నారు.
తాము ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయట్లేదని, క్యాసినో లు నడిపించట్లేదని, తాను టిఆర్ఎస్ మంత్రిని కాబట్టే దాడులు చేసి వేధిస్తున్నారన్నారు. 200 మంది ఐటీ అధికారులతో తమ పై దాడులు చేయించి భయపెడుతున్నారన్నారు. తన కొడుకుని చూద్దాం అంటే కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదని, చుట్టూ అధికారులు, CRPF పోలీసులు వున్నారని, తన కొడుకు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడని, నిన్న మహేందర్ ని బాగా కొట్టారని ఆరోపించారు.