ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో లక్ష్మయ్య అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నం చేశాడు. ఆటో డ్రైవర్ నిస్కారణంగా తనపై దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లక్ష్మయ్య వచ్చాడు. అయితే స్టేషన్ లో ఎస్సై లేకపోవడంతో మళ్లీ రావాలని స్టేషన్ లోని రైటర్ షేక్ అబ్దుల్ సలీమ్ చెప్పాడు. తర్వాత మళ్లీ వచ్చిన లక్ష్మయ్య మరో మారు రైటర్ ను ప్రశ్నించాడు. అదే సమాధానం రావడంతో స్టేషన్ బయటికి పెట్రోల్ తెచ్చుకున్న లక్ష్మయ్య టిపైన పోసుకొని నిప్పంటించుకున్నాడు. నిప్పు అంటించుకున్న లక్ష్మయ్య రైటర్ ను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునే క్రమంలో రైటర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రైటర్ ను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలలో గాయపడ్డ లక్ష్మయ్య పరిస్థితి విషమం గా ఉంది. వైద్యం కోసం ఒంగోలు కు తరలించారు.
previous post