ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం రూరల్ మండలం గోల్లపాడులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బోయినపల్లి వీరబాబు(35) తన ఇంటి పక్కన ఉన్న ఓ చిన్నారి బజార్లో ఆడుకుంటుండగా తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో చిన్నారి ప్రతిఘటించగా గాయపరిచాడు. దాంతో చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.