గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
నాలుగో చెక్ పోస్టు వద్ద పురుగుల మందు డబ్బా ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
కర్నూలు జిల్లా గోనుగుండ్ల మండలం అల్వాలకు చెందిన వెంకటేశ్(27)గా అతడిని గుర్తించారు.
ఆర్థిక సాయం చేయాలని సీఎంను కోరేందుకు వెంకటేష్ వచ్చాడు.
న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగుతానంటూ వెంకటేశ్ అంటున్నాడు.
పోలీసులు సకాలంలో గుర్తించడంతో వెంకటేశ్ ఆలోచన అమలు కాలేదు.
చెక్ పోస్టు పోలీసు సిబ్బంది వెంకటేశ్ ను తాడేపల్లి పీఎస్ కు తరలించారు.