ఆస్ట్రేలియా లో వ్యాపిస్తున్నకార్చిచ్చు మరో ముగ్గురిని బలితీసుకుంది.కార్చిచ్చును అదుపు చేసేందుకు వచ్చిన కెనడా విమానం అల్పైన్ లో కూలిపోవడాం తో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా అమెరికన్ పౌరులేనని చెప్పారు.మొనారో మంచు ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని న్యూసౌత్వేల్స్ రాష్ట్ర రూరల్ ఫైర్ సర్వీసెస్ కమిషనర్ షేన్ ఫిట్జ్సిమ్మన్స్ తెలిపారు.
పూర్తి స్థాయిలో నీటిని నింపుకున్న ఈ వాటర్ ట్యాంకర్ విమానం కార్చిచ్చు మంటలను అదుపు చేసే క్రమంలో కూలిపోయిందన్నారు. ఈ విమానాన్ని కెనడియన్ అగ్నిమాపక సంస్థ కౌల్సన్ ఏవియేషన్ లీజుకు తీసుకున్నదని ఫిట్జ్సిమ్మన్స్ వివరించారు.