టీ 20 వరల్డ్ కప్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిసారి టీ 20 వరల్డ్ కప్ సాధించింది. కివీస్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీసీ బ్యాటర్లు మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించారు. ప్లేయర్ ఆప్ ద మ్యాచ్గా మిషెల్ మార్ష్ నిలిచాడు.
ప్లేయర్ ఆప్ టోర్నమెంట్ అవార్డ్ వార్నర్కి దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మార్టిన్ గప్టిల్ (28), డారిల్ మిచెల్ (11) తొలి వికెట్గా 28 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కీలక మ్యాచులో భారీ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు.