27.7 C
Hyderabad
April 25, 2024 10: 35 AM
Slider సినిమా

సమంత లానే అరుదైన వ్యాధితో మమత

#mamatamohandas

సమంతకు వచ్చిన అరుదైన వ్యాధి ఇప్పుడు మరో నటి మమతా మోహన్ దాస్ కు కూడా వచ్చింది. తనకు విటిలిగో అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకిందని మమతా మోహన్ దాస్ ప్రకటించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన వ్యాధి గురించి చెప్పింది. సమంతా రూత్ ప్రభు తర్వాత, మలయాళ నటి ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ హిట్ చిత్రం జన గణ మన మమత ముఖ్యమైన పాత్ర పోషించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రం గత సంవత్సరం 2022లో విడుదలైంది. మమతా మోహన్‌దాస్ ఇప్పటి వరకూ హాడ్కిన్స్ లింఫోమాతో పోరాడారు. సమంతా రూత్ ప్రభు కు మైయోసిటిస్ అనే వ్యాధి నిర్ధారణ తర్వాత, మలయాళ నటి మమతా మోహన్‌దాస్ కూడా ఇదే రకమైన వ్యాధితో బాధపడుతుండటం చర్చనీయాంశం అయింది. అనారోగ్యంతో పోరాడుతున్న మమత ఇప్పటికే తన శరీర ఛాయను కూడా కోల్పోయింది.

ఆమె సోషల్ మీడియాలో ఈ వార్తను పంచుకున్న క్షణం నుంచి అభిమానులు మరియు పరిశ్రమ స్నేహితులు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొందరు ఆమెను ఫైటర్ అని సంబోధిస్తూ సందేశాలు పంపారు. గతంలో మమత క్యాన్సర్, లింఫోమాతో పోరాడగా ఇప్పుడు విటిలిగో (బొల్లి)కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

Related posts

హాస్పిటలైజ్డ్ :క్రీడాకారిణి మెడలోకి దిగిన బాణం

Satyam NEWS

మీడియా హైప్ తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏదీ?

Satyam NEWS

సంఘం ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం

Sub Editor 2

Leave a Comment