33.2 C
Hyderabad
April 25, 2024 23: 32 PM
Slider గుంటూరు

నరసరావుపేటలో ఆటోనగర్ నిర్మాణానికి మరో ముందడుగు

#autonagar

గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఆటోనగర్ నిర్మాణానికి మరొక అడుగు ముందుకు పడింది. 40 ఏళ్ల కల సాకారనికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మోటార్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆటోనగర్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందచేయగా. తక్షణమే ఆయన ఎమ్మార్వో తో ఫోన్లో మాట్లాడారు.

స్థల పరిశీలన జరిగినదని, సంబంధిత సమాచారం అధికారులకు అందించామని, నిర్మాణానికి సంబంధించి అనుమతులు త్వరలో వస్తాయని ఎమ్మార్వో రమణ నాయక్ తెలిపారు.

నరసరావుపేట త్వరలో జిల్లా హెడ్ క్వార్టర్ కానున్న నేపధ్యంలో ఆటో నగర్ నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకే పలుమార్లు ఏపీఐసీసీ చైర్మన్ రోజా ను కలిశామని, ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసి అనుమతులు మంజూరు చేసారని తెలిపారు.

ఈ ఆటో నగర్ నిర్మాణం పూర్తయితే ఎంతో మంది లారీ , ట్రాక్టర్లు వంటి భారీ వాహనదారులకు ఎంతో ఊరట కల్పించినట్లవుతుంది.

ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ కె.అనిల్ కుమార్, ప్రెసిడెంట్ కె.ఓబుల్ రెడ్డి, కోశాధికారి ఎస్ కె.అలీ, వలి, అమర్నాథ్, బాజి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమీర్ పేట్  గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రికి మహర్దశ

Satyam NEWS

ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడిని ప్రతిఘటిస్తాం

Satyam NEWS

అంబర్ పేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Bhavani

Leave a Comment