సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ విషయం అవినాశ్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేయనున్నారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పి ఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందుకు బెయిల్ పిటీషన్ మెన్షన్ అంశం వస్తుంది. గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటీషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ ను విచారణ తేదీని ఖరారు చేయలేదు. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని సిజెఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది. ఈ రోజు సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటీషన్ను మెన్షన్ చేయనున్నారు. అవినాశ్ పిటీషన్ ను వ్యతిరేకించేందుకు సునీతా తరపు లాయర్లు సిద్ధంగా ఉన్నారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు బెయిల్ పిటీషన్ దాఖలు చేసేంతవరకూ తనను సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను అవినాశ్ కోరే అవకాశాలున్నట్లు సమాచారం
previous post
next post