బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పలు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎంపిపి అశోక్ పటేల్ గ్రామంలో పర్యటించి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు శుభ్రత పాటించాలని ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండేందుకు సహకరించాలన్నారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ ఒకరు వచ్చి పనులు ముగించుకుని త్వరగా వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఈ వైరస్ ను వ్యాపించకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టిందని కావున గ్రామ ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాజరత్నం ఆశా కార్యకర్త అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.