బాలాజీ హైస్కూల్లో బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ పై ములుగు పోలీసు శాఖ వారిచే విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ములుగు ఏ ఎస్ ఐ రవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అందుకు పాల్పడినవారు చట్టరీత్యా శిక్షించ పడతారని, అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థుల ను ఉద్దేశించి తెలిపారు.
ఎలాంటి అత్యవసర ఈ పరిస్థితులలోనైనా నెంబర్ వందకు(100) డయల్ చేయాలని, అంతేకాకుండా కుటుంబ కలహాలు గొడవకు దారి తీసిన పుడు “సఖి” సహాయ కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె రజనీకాంత్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ ను అరికట్టడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని విద్యార్థులకు తెలియజేశారు. ఇలాంటి అవగాహన సదస్సు తమ పాఠశాలలో నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటరమణ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.