39.2 C
Hyderabad
March 28, 2024 17: 08 PM
Slider జాతీయం ప్రత్యేకం

అయోధ్య భూ వివాదం కొనసాగిన తీరు ఇది

9576ae035d7547c4b864bc6bf4907972_18

15వ దశాబ్దం నుంచి నేటికీ చర్చనీయాంశంగా ఉన్న అత్యంత సున్నితమైన కేసు ‘అయోధ్య భూవివాదం’. 2.77 ఎకరాల భూమిపై తమదంటే తమదే హక్కు అని హిందూ, ముస్లిం వర్గాలు ఎప్పటినుంచో వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మొఘల్​ చక్రవర్తి బాబర్​ కాలం నుంచి నానుతున్న ఈ వివాదం పూర్వాపరాలు ఇవి:

1528 : మొఘల్​ చక్రవర్తి బాబర్​ సేనాని​ మీర్​ బాఖీ.. బాబ్రీ మసీదును నిర్మించారు.

1885 : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసు తొలిసారి కోర్టు మెట్లెక్కింది. మసీదు వెలుపల మండపాన్ని నిర్మంచేందుకు అనుమతివ్వాలని మహంత్‌ రఘువీర్‌ దాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం కొట్టివేసింది.

1949 : వివాదాస్పద మసీదు లోపల రాముడి విగ్రహాలు వెలిశాయి. వీటిని హిందూ సంఘాలే పెట్టాయని ముస్లిం సంస్థలు ఆరోపించాయి.

1950 : రాముడికి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని గోపాల్​ సిమ్లా విశారథ్, పరమహంసా రామచంద్రదాస్​.. ఫైజాబాద్​ జిల్లా కోర్టులో దావా వేశారు.

1959 : అయోధ్య వివాదాస్పద స్థలంపై తమకే హక్కుందని కోర్టును ఆశ్రయించిన నిర్మోహి అఖాడా సంస్థ.

1981 : అయోధ్య వివాద స్థలం తమదేనని ముస్లిం వర్గానికి చెందిన సున్నీ వక్ఫ్​ బోర్డు తరఫున కోర్టులో వ్యాజ్యం దాఖలు.

1986 ఫిబ్రవరి 1 : మసీదులో హిందూ వర్గం వారు పూజలు చేసుకునేందుకు అనుతించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసిన స్థానిక కోర్టు.

1992 డిసెంబర్​ 6 : బాబ్రీ మసీదు కూల్చివేత.

2002 ఏప్రిల్​ : వివాదాస్పద భూమిపై ఎవరికి హక్కుందో తేల్చేందుకు అలహాబాద్​ హైకోర్టులో విచారణ మొదలు.

2010 సెప్టెంబర్​ 30 : వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాలు మూడు సమాన భాగాలుగా పంచుకోవాలని అలహాబాద్​ హైకోర్టు తీర్పు.

2011 మే 21 : అలహాబాద్​ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే.

2017 ఆగస్టు 7 : అలహాబాద్​ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.

2018 జులై 20 : అయోధ్య తీర్పును వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.

2018 డిసెంబర్​ 24 : 2019 జనవరి 4న మరోమారు అయోధ్య వ్యాజ్యాలపై విచారణ చేపడతామన్న సుప్రీం.

2019 జనవరి 8 : అయోధ్య వ్యాజ్యాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. సీజేఐతో పాటు సభ్యులుగా జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ డీవై చంద్రచూడ్​.

2019 జనవరి 25 : కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్​ లలిత్. జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ బోబ్డే, జస్టిస్​ చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ నజీర్​తో కూడిన నూతన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.

2019 జనవరి 29 : వివాదాస్పద భూమి చుట్టూ ఉన్న 67 ఎకరాల స్వాధీన భూమిని వాటి యజమానులకు ఇవ్వాల్సిందిగా సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం.

2019 మార్చి 8 : వివాద పరిష్కారానికి సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు.

2019 ఏప్రిల్​ 9 : 67 ఎకరాల భూమిని యజమానులకు అప్పగించాలన్న కేంద్రం పిటిషన్​ను వ్యతిరేకించిన నిర్మోహి అఖాడా.

2019 మే 9 : సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పణ.

2019 మే 10 : మధ్యవర్తిత్వ కమిటీ తన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించిన సుప్రీం.

2019 ఆగస్టు 1 : పూర్తి నివేదికను సుప్రీంలో సీల్డ్​ కవర్​లో సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ.

2019 ఆగస్టు 2 : అయోధ్య వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైనందున… ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీం నిర్ణయం.

2019 ఆగస్టు 6 : అయోధ్య వ్యాజ్యాలపై సుప్రీంలో రోజువారీ విచారణ ప్రారంభం.

2019 అక్టోబర్​ 16 : ముగిసిన వాదనలు.

2019 నవంబర్​ 9: అయోధ్య తీర్పు వెలువడింది.

Related posts

బర్నింగ్ ప్రాబ్లమ్: ఇసుకా ఇసుకా ఎంత దాకా వచ్చావ్?

Satyam NEWS

క్రీడాకారిణికి అంబర్ పేట్ ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

Satyam NEWS

ఎస్కేప్డ్:జైలు నుంచి తప్పించుకున్న తాలిబన్ ఉగ్రవాది

Satyam NEWS

Leave a Comment