కరోనా…కరోనా…కరోనా. ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా గతేడాది నుంచీ ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. ఫలితంగా ఆ కరోనా బారిన పడ్డవారు.. ఆవైరస్ సోకకుండా ఉండేందుకుగాను ప్రతీ ఒక్కరూ భారత దేశంలో సనాతన,సంప్రదాయ బద్దంగా వచ్చే ఆయుర్వేదం,పసరు,నాటు వైద్యంపై దృష్టి సారిస్తున్నారు.
సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ ఆయుష్ 64, కబసురా కుడినిర్ ఔషధం కోసం దేశవ్యాప్తంగా పంపిణీని ప్రారంభించడం దానిపై ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. కరోనా సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన కొత్త కార్యక్రమం ఇది.
అయితే ప్రస్తుతం పెరుగుతున్న సోషల్ మీడియా ద్వారా అందరికి వైద్య పరిజ్ఙానం ఇట్టే తెలిసిపోతోంది. కాని భారతీయ ఆయుర్వేదాన్ని తెలుసుకోవాలంటే…సోషల్ మీడియా ఇట్టే పోస్ట్ చేసేంత కామెంట్స్ వల్ల కాదు…మిడిమిడి జ్ఙానంతో స్మార్ట్ ఫోన్ లలో తెలుసుకునేదీ అంతకన్న కాదు.
మానింది మందు…బతికింది ఊరు అన్న చందంగా…ఏదైనా మందు వేస్తే ఆ జబ్బు నయం కావలి. అందుకు రోగికి సహనంతో పాటు డాక్టర్ పరిజ్ఙానం కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం ఈ ఉరుకులు,పరుగుల వయస్సులో క్షణాలలో వచ్చిన వ్యాధి కాని జబ్బు కాని మానాలంటే..అందుకు ప్రతీ ఒక్కరి శరీరంలో అందుకు గల రుగ్మతలను,కారణాలను తెలుసుకోవాలి.
అందుకు పతి అని చివర ఉండే ఏ వైద్యం సరైంది కాదు..శాస్త్రీయమైనది కాదు. పూర్వ కాలంలో చరకుడు కనిపెట్టిన ఆయుర్వేదమే అన్నింటికి మూలం.
ఈ ఆధునిక కాలంలో వచ్చిన కరోనా మూలంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన , కబసురా కుడినిర్ 64 ఔషధానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. అన్ని ఆయుర్వేద మందుల షాపులల్లో దీన్ని పంపిణీ చేస్తున్నారు.
కాగా ఈ ఆయుర్వేదంపై కొంతమంది కొన్ని దుష్ర్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖ లో స్థిరపడ్డ ప్రముఖ వైద్యులు డా.ఎన్వీఎస్ హరగోపాల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారికి అంతం చేసేందుకు ప్రాచీనమైన ఆయుర్వేదంలో మందులు ఉన్నాయని ప్రస్తుతం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఆ తరహా మందులను పంపిణీ చేస్తున్నదన్నారు…విశాఖకు చెందిన ప్రముఖ ఆయుర్వేద,పంచగవ్య వైద్య నిపుణులు డా.హరగోపాల్.
(డాక్టర్ హరగోపాల్ సెల్ నెంబర్ 7013424730)