కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా సంసమని వటి టాబ్ లెట్లు వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయని పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం (చిన్నతిరుపతి) ఆయుర్వేద వైద్యాధికారి కె వాణి అన్నారు.
వ్యాధి నిరోధక శక్తి పెంచే ఈ ఆయుర్వేదం మందును అందరూ వాడవచ్చునని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కరోనా రాకుండా ఉండేందుకు, వ్యాధినిరోధక శక్తిని పెంచు కోవడానికి ద్వారకా తిరుమల దేవస్థానం ఉద్యోగులందరికి వీటిని అందచేస్తున్నామని ఆమె తెలిపారు.
సోమవారం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణ లో ఈఓ జి వి సుబ్బారెడ్డిని కలిసి ఆయుర్వేద బిళ్ళలను డాక్టర్ వాణి అందజేశారు.