వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ గ్రామ సమీపాన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని బాలాజీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ చైర్మన్ సునీత చేతుల మీదుగా ఆకృతి డెవలపర్ బ్రోచర్నువిడుదల చేశారు. అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నరహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, తాండూరు మండల జడ్పీటీసీ గౌడి మంజుల, వివిధ పార్టీల నాయకులు మురళీ గౌడ్, పట్లోళ్ల నర్సిములు, రాజు నర్సిరెడ్డి, జి. శ్రీనివాస్, తాండూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఆయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.