34.2 C
Hyderabad
April 19, 2024 21: 00 PM
Slider గుంటూరు

అయ్యప్ప దీక్ష చేపట్టిన గుజరాల ఎమ్మెల్యే కాసు మహేష్

#kasumaheshreddy

గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అయ్యప్ప మాల ధరించారు. రాజకీయ వ్యవహారాలతో నిత్యం బిజీ గా ఉండే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండలం రోజులు అయ్యప్ప సేవలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఆయన నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేసి మాల ధారణ చేసుకున్నారు.

అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడు శ్రీహరి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మాలధారణ చేశారు. మండలం రోజుల పాటు అయ్యప్ప దీక్షను నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో బాటు ఆయన మిత్రుడు డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ కూడా మాలధారణ చేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మకర్త గంధం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్సార్ టిపి జహీరాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బోరికి సంజీవ్

Satyam NEWS

రోజూ వేధిస్తున్న కొడుకును చంపేసిన తండ్రి

Satyam NEWS

భద్రతా మండలిలో పాక్ కు చుక్కెదురు

Satyam NEWS

Leave a Comment