36.2 C
Hyderabad
April 25, 2024 22: 20 PM
Slider ఆధ్యాత్మికం

మకర విళక్కు కోసం మళ్లీ తెరుచుకోనున్న శబరిమల

sabarimala

రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు నేడు మకర విళక్కు కోసం తెరచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరవనున్నారు.

ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరుగనున్నందున, ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.

Related posts

న్యూ లీడర్: పులివెందుల బాధ్యతలు బీటెక్ రవికి

Satyam NEWS

కోవిడ్ ఎలర్ట్: మీడియా పాయింట్ వద్ద నో ఎంట్రీ

Satyam NEWS

టిటిడి విజిలెన్స్ అదుపులో ద‌ర్శ‌న టికెట్ల దళారులు

Satyam NEWS

Leave a Comment