39.2 C
Hyderabad
April 23, 2024 18: 44 PM
Slider ఖమ్మం

పిడిఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఆజాద్

#pdsu

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా నామల ఆజాద్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఎన్నికయ్యారు. పిడిఎస్ యు 23వ మహాసభలు వైరా పట్టణంలోని శ్రీపాద శ్రీహరి నగర్ లో  జరిగాయి. ఈ మహాసభలో ఉపాధ్యక్షులుగా కిరణ్, ఉష, సహాయ కార్యదర్శిగా నవీన్, సతీష్ కోశాధికారిగా లక్ష్మణ్ తో పాటు జిల్లా లోని వివిధ మండలాల నుంచి 15మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మహాసభలో పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు.  ఖమ్మం జిల్లాలో  యూనివర్సిటీ సత్వరమే ఏర్పాటు చేయాలని,  ఖమ్మం జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాల పనులను త్వరితి గతిగా పూర్తిచేసి తరగతులను ప్రారంభించాలని, అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయాలని, .ప్రతి మండల కేంద్రంలో ఇంటర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని,  విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు పెంచాలని, రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ప్రభుత్వ హామీ ప్రకారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సత్వరమే అమలు చేయాలని తీర్మానం చేశారు.

Related posts

వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల బీసీల ధర్నా

Bhavani

కరోనా ఎఫెక్ట్: రాజస్థాన్ రాష్ట్రం మొత్తం 31 వరకూ షడ్డౌన్

Satyam NEWS

అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం

Satyam NEWS

Leave a Comment