ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత ప్రధాని మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరం భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో విజ్ఞాన భారతి స్కూల్ ,స్పార్క్ సొసైటీ సహకారంతో కోట జం నుంచి గంటస్థంభం జంక్షన్ వరకూ జాతీయ జెండాలతో ర్యాలీ చేస్తూ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర స్వఛ్ఛ భారత్ కో-కన్వీనర్ కుసుమంచి సుబ్బారావు మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి ఇప్పటికే పలుసార్లు వివిధ పరిస్థితులలో చాటి చెప్పారన్నారు. అంతేకాకుండా ఈసారి భారతీయ ప్రజల ఐక్యతను, సమైక్యతను ప్రపంచానికి చూపాలనే సదుద్దేశ్యంతో ఈ ఆగష్టు 13,14,15 తేదీలలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేద్దాం.. మన దేశ భక్తిని చాటుదాం…. అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి పావనీ గారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను గౌరవించడంలో అలాగే భారతీయ శక్తిని చాటి చెప్పడంలో భారతీయ జనతాపార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు తీగెల అచ్యుత హరనాధ్, బగ్గాం రాజేష్, ఇమంది సుధీర్, బొబ్బిలి శ్రీనివాస్, కంది సీతారాం, సోము మహేష్, అబ్దుల్ ఆధిల్, కూర్మారావు, జమ్ము రాంబాబు, ఇప్పిలి అప్పలకొండ, శంకర్, శ్రీదేవి, వేణుగోపాల్, పద్మనాభం పాల్గొన్నారు.