జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే 1893 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, 68 నామినేషన్లు తిరస్కరణకు గురైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మిగతా అభ్యర్థుల బీ-పాంల అందజేత శనివారం సాయంత్రం వరకూ విధించిన గడువును ఎన్నికల కమిషన్ పొడిగించింది. అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాగా ఆదివారం సాయంత్రం 3 గంటల వరకు బీ-ఫాం ఇచ్చేందుకు గడువు పోడిగిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. బీ-ఫాం గడువు పొడిగింపుతో మరింత మంది అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా బీ-ఫాం అందజేసిన అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు.
previous post
next post