ప్రయివేటు ఛానెళ్లు ఎంత చించుకున్నా దేశంలో ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించింది దూరదర్శన్ ఛానెల్. ఏప్రిల్ 3న ముగిసిన వారాంతానికి బార్క్ విడుదల చేసిన వ్యూయర్ షిప్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది. దూరదర్శన్ ఈ సమయంలో దాదాపు 40,000 శాతం వ్యూయర్ షిప్ పెంచుకుంది. దీనికి ముఖ్యంగా రామాయణం పున: ప్రసారం చేయడమే కారణం.
ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా దూరదర్శన్ తన వీక్షకులను రామాయణం పున: ప్రసారం చేసి విపరీతంగా పెంచుకుంది. లాక్ డౌన్ సమయంలో వ్యూయర్ షిప్ పెంచుకుందామని ఆశపడ్డ ప్రయివేటు న్యూస్, ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల ఆశలపై ఈ విధంగా దూరదర్శన్ నీళ్లు చల్లింది. రామాయణం, మహాభారతం టెలికాస్టు చేయడం ద్వారా దూరదర్శన్ లాక్ డౌన్ సమయంలో హీరోగా నిలిచింది.