సిద్దిపేట పట్టణంలోని BJR కూడలిలో ఉన్న డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జగ్జివన్ రామ్ 1952 నుండి వరసగా 8సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, సుధీర్ఘ కాలం కేంద్ర మంత్రి గా పని చేశారని గుర్తు చేశారు.
పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతో కృషి చేశారని హరీష్ రావు అన్నారు. మహాత్మా గాంధీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్ రామ్ ను కొనియాడారని కూడా ఆయన గుర్తు చేశారు. ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితాన్ని ఆయన గడిపారని మంత్రి అన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు.. తెలంగాణ సీఎం కెసిఆర్ అంబెడ్కర్, జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారు.. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పది లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉంది.. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంటే నేడు సీఎం కెసిఆర్ అన్ని రంగాల్లో రిజర్వేషన్ తెచ్చారు..అని హరీష్ రావు అన్నారు.
ఎస్సీ సంక్షేమ నిధి ఎక్కడ మురిగిపోకుండా చట్ట భద్రత చేసిన ప్రభుత్వం టి ఆర్ ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు. ఎస్ టి సబ్ ప్లాన్ నిధుల కంటే ఎస్సీ నిధులను అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.. మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం…అని ఆయన అన్నారు.