31.2 C
Hyderabad
April 19, 2024 04: 51 AM
Slider ముఖ్యంశాలు

మూడు రోజులపాటు పశ్చిమ గోదావరి లో బాబు పర్యటన

#chandrababu

టి‌డి‌పి అధినేత  నారా చంద్రాబాబునాయుడు ఈ నెల 30 వ తేదీ నుండి మూడు రోజుల పాటు  ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఇదేమీ ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30 వ తేదీన కలపర్రు టోల్ గేట్ వద్ద నుంచి ప్రారంభమై  విజయరాయిలో ఇదేమిఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్నీ లాంచనంగా ప్రారంభింస్తారు. అక్కడనుంచి దెందులూరు మరియు చింతలపూడి నియోజకవర్గం సరిహద్దు గ్రామం రామచంద్రాపురంలో రైతులతో మాట్లాడతారు. తర్వాత  చింతలపూడి చేరుకుని చింతలపూడి రోడ్ షోలో  మాట్లాడీ రాత్రి చింతలపూడిలో బస చేస్తారు. 1వ  తేదీన  చింతలపూడిలో బయలుదేరి తాడువాయి బుట్టాయిగూడెం మీదుగా రోడ్ షో ద్వారా పోలవరం చేరుకుంటారు. పోలవరం నుంచి బయలుదేరి రాత్రికి కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని రాత్రి కొవ్వూరులో బస చేస్తారు. 2వ తేదీన కొవ్వూరులో బయలుదేరి రోడ్ షోగా నిడదవోలు చేరుకుని నిడదవోలు బహిరంగ సభలో పాల్గొంటారు.  అక్కడనుంచి రోడ్ షోగా బయలుదేరి తాడేపల్లిగూడెం చేరుకుని తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Related posts

మసీదుల్లో నిలిచిపోయిన సామూహిక ప్రార్ధనలు

Satyam NEWS

రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికం

Satyam NEWS

బి ఫామ్ ఇచ్చి గెలిపించిన పార్టీ కన్న తల్లితో సమానం

Satyam NEWS

Leave a Comment