30.3 C
Hyderabad
March 15, 2025 09: 23 AM
Slider ముఖ్యంశాలు

హైకోర్టులో జగన్ కు ఎదురుదెబ్బ..

మంత్రి పొంగూరు నారాయణ తనపై వేసిన పరువునష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి 9కి వాయిదా వేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకురాగా నారాయణ తరఫున న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు.

కౌంటర్‌ వేసేందుకు మరింత సమయం ఇవ్వాలని, పిటిషనర్‌, సాక్షి పత్రికకు సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. తమ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించాలని కోరారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ విచారణను జనవరి 9కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Related posts

గేమ్ స్టార్ట్: సీఎం జగన్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

Satyam NEWS

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు

mamatha

వాట్ ఏన్ ఐడియా: కాళేశ్వరం చుట్టూ పర్యాటక కేంద్రాలు

Satyam NEWS

Leave a Comment