28.2 C
Hyderabad
April 20, 2024 11: 47 AM
Slider కృష్ణ

అధ్వాన్నపు రోడ్లు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి మృతి

#roadaccident

ఆంధ్రప్రదేశ్ లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు ఎందరి ప్రాణాలనో తీస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి ప్రాణం కూడా అధ్వాన్నంగా ఉన్న రోడ్డుతో పోయింది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం లో ఈ దారుణం జరిగింది. అధ్వాన్నపు రోడ్డు కారణంగా తేలప్రోలు గ్రామానికి చెందిన ఎంపీపీ పులపాక ప్రసన్నకుమారి మృతి చెందారు. మంగళవారం రాత్రి ప్రసన్నకుమారి తన భర్తతో కలిసి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి  వెళుతుండగా ప్రమాదం జరిగింది.

ఉంగుటూరు మండలం ఆనందపురం రోడ్ లో ద్విచక్ర పై ప్రయాణిస్తుడగా గుంతల రోడ్డులో ఒక గుంతను తప్పించే సమయంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం పడిపోయింది. ఎంపీపీ ప్రసన్న కుమారి కి తీవ్ర గాయాలు అయ్యాయి. భర్త కి స్వల్ప గాయాలు తగిలాయి. గాయపడ్డ ఎంపీపీ ప్రసన్నకుమారి ని దగ్గర్లో ఉన్న పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం ఎంపీపీ పులపాక ప్రసన్నకుమారి మృతి చెందారు. ఏపిలో రోడ్ల పరిస్థితి ఇంత దారణంగా ఉందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

Related posts

ప్రభుత్వానికే ‘ఆక్సిజన్’ అందిస్తున్న సోనూసూద్

Satyam NEWS

కాప్రా సర్కిల్ జలమండలి కార్యాలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

వరంగల్ జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Bhavani

Leave a Comment