వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోశమ్మకు మంగళవారం భక్తులు బోనాలు ఘనంగా సమర్పించారు. డప్పుచప్పుళ్ల మధ్య, నృత్యాలు చేస్తూ నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. అనంతరం ఆలయంలో పట్నాలు వేసి, కల్లుపోసి, సారెపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.
రాజన్నను దర్శించుకున్న అనంతరం బద్దిపోశమ్మకు బోనం సమర్పించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.మేడారం జాతరకు వెళ్లే ముందు పోచమ్మకు మేకలు కోళ్లు కోసి తిని ఆనందముగా తిరిగి వెళుతుంటారు.