తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారిని గౌరవించే సురుచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు కాకినాడ విచ్చేసిన అఖండ మూవీ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు బాహుబలి కాజా బహూకరించారు. హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి సురుచి గురించి వివరించి బాహుబలి కాజాను అందజేసి శాలువాతో సత్కరించారు. జైస్వాల్ మాట్లాడుతూ తాపేశ్వరం కాజా గురించి విన్నాను అది ఇప్పడు చూస్తున్నాను అని అన్నారు. ఇంత పెద్ద బాహుబలి కాజాను చూడడం ఇదే మొదటిసారి అన్నారు.