వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయనపై రాజద్రోహం నేరం కేసు పెట్టారు.
గుంటూరు సిబిసిఐడి పోలీసులు రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి మంగళగిరి తీసుకువెళ్లారు.
అక్కడ లాకప్ లో ఆయనపై దాడి జరిగిందనే విషయం కూడా ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులో స్పష్టం అయింది.
ఈ నేపధ్యంలో వాదోపవాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరన్, బి ఆర్ గవేరిలు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.