బాజీ బాబాజీ చందనోత్సవం నేడు వైభవంగా జరిగింది. కరోనా ఆంక్షల కారణంగా భక్తులు అందరూ ఆన్ లైన్ లోనే చందనోత్సవం నిర్వహించుకున్నారు. విజయవాడ భవానీ పురంలో ఉన్న బాజీ బాబాజీ దర్గాలో ముఖ్యమైన వ్యక్తులు చందనోత్సవం నిర్వహించుకోగా దాన్ని ఆన్ లైన్ లో వీక్షించిన భక్తులు తమ తమ ఇళ్లలోనే చందనోత్సవం జరిపారు.
ప్రతి ఏటా బక్రీద్ రోజు, ముందు వెనక రోజులలో బాజీ బాబాజీ చందనోత్సవం జరుగుతుంది. చందనోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు భవానీ పురం వచ్చి జాబీ బాబాజీకి చందనం సమర్పించుకుంటారు.
అయితే ఈ ఏడాది కరోనా కారణంగా అలా చేయలేకపోయారు. ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమింగ్ చూసి బాజీ బాబాజీ భక్తులు ఆయనను స్మరించుకున్నారు.