కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని బక్రీద్ నిర్వహించుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు ముస్లిం మత పెద్దలకు సూచించారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లోశుక్రవారం నాడు ఆయన రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
బక్రీదు సందర్భంగా నెల రోజులు ఆవులను అమ్మడం గాని కొనడం కానీ దిగుమతి ఎగుమతి చేయడం కూడా నేరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చట్ట విరుద్ధంగా నడిచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కరోనా సందర్భంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ లు ధరిస్తూ నిబధనలతో ఉండాలని ఏసీపీ శ్రీనివాసరావు కోరారు.