శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ గుండబాల మోహన్ కు 2021 సంవత్సరానికి జాతీయ స్థాయి గాంధీ శాంతి దూత్ పురస్కారం దక్కింది. భారతదేశం మానవ హక్కులు, సామాజిక న్యాయం సంఘం వారు ఈ పురస్కారాన్ని ప్రకటించారని మోహన్ తెలిపారు.
ఈ పురస్కారాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఆయనకు అందచేస్తారు. గత 15 సంవత్సరాల నుంచి ఆయన వ్యాయామ ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నారు.
శ్రీకాకుళం గ్రామీణ మండలంల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
విద్యార్థినీ విద్యార్థులు అనారోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు, పేద విద్యార్థులకు ప్రవేశ రుసుము పుస్తకాలు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు.