36.2 C
Hyderabad
April 25, 2024 22: 32 PM
Slider శ్రీకాకుళం

డాక్టర్ మోహన్ కు గాంధీ శాంతి దూత్ పురస్కారం

#gandhipuraskar

శ్రీకాకుళం జిల్లాకు  చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు  డాక్టర్  గుండబాల  మోహన్ కు 2021 సంవత్సరానికి జాతీయ  స్థాయి గాంధీ శాంతి దూత్ పురస్కారం దక్కింది. భారతదేశం మానవ హక్కులు, సామాజిక న్యాయం సంఘం వారు ఈ పురస్కారాన్ని ప్రకటించారని మోహన్ తెలిపారు.

ఈ పురస్కారాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఆయనకు అందచేస్తారు. గత 15 సంవత్సరాల నుంచి ఆయన  వ్యాయామ ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలంల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తి  కాకుండా పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

విద్యార్థినీ విద్యార్థులు అనారోగ్య సమస్యలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు, పేద విద్యార్థులకు ప్రవేశ రుసుము పుస్తకాలు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

మూలన పడ్డ “మహారాజ”…గుర్తులు..

Satyam NEWS

ఎక్కువ సంతానం ఉండొద్దన్న నిబంధన తొలగించండి

Bhavani

Leave a Comment