36.2 C
Hyderabad
April 24, 2024 22: 09 PM
Slider ఆధ్యాత్మికం

వ‌చ్చే నెల 4 నుంచి వెంక‌న్న ఆల‌య పునః ప్రతిష్ఠా మహోత్స‌వం

#balajitemple

త్రిదండి చిన శ్రీమ‌న్నారాయ‌ణ రామానుజ జియ‌ర్ స్వామి చేతుల మీదుగా విజ‌య‌న‌గ‌రం  బాలాజీన‌గ‌ర్ లో ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం లో దాదాపు యాభై ఏళ్ల కింద‌ట వెలసిన  శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో  తిరిగి ఆ వెంక‌న్న ఆల‌య పునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఆల‌య క‌మిటీ నిర్ణ‌యించింది. అందులో భాగంగా  వ‌చ్చే నెల  4 నుంచి అంటే అంటే జూన్  నెల 4 నుంచీ ప‌న్నెండవ తేదీవ‌ర‌కు ఈ ఆల‌య పునః ప్ర‌తిష్ట మ‌హోత్సవాల‌ను  నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వారి సువర్ణ హస్తముల మీదుగా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్టా కార్యక్రమములు జరుగుతాయని ఆల‌య నిర్వాహ‌కులు భ‌గ‌వాన్, ర‌మ‌ణాజీలు తెలియ చేసారు. అలాగే పై కార్యక్రమములలో స్వచ్చందంగా సేవ చేయుటకు  అవకాశమున్న భక్తులు దేవాలయములో పేర్లు నమోదు చేసుకొనవలసిందిగా కోరారు.

దీంతో దాదాపు 50 స్వ‌చ్చందంగా  శ్రీవారి సేవ  చేసేందుకు ముందుకు వ‌చ్చి త‌మ‌,త‌మ పేర్ల‌ను నిర్వాహ‌కులైన భీంసింగ్, పార్ధ‌శారధి, ఇవ్వాల‌ని గోవింద సేవ చీప్  సెక్ర‌ట‌రీలు కోరారు. దీంతో గ‌డ‌చిన కొద్ది రోజుల నుంచీ బాలాజీ న‌గ‌ర్ లో అదీ వెంక‌టేశ్వ‌రస్వామి టెంపుల్ లో పండ‌గ వాతావ‌రణం నెల‌కుని ఉంది.

Related posts

ఏపిలో ఆగని కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య

Satyam NEWS

సిఎం స‌హాయ నిధికి ఎన్ఆర్ఐ పైళ్ళ విరాళం రూ.కోటి

Satyam NEWS

తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Satyam NEWS

Leave a Comment