నందమూరి అభిమానులు ఏ అవకాశం వచ్చినా ప్రజాసేవకు పునరంకితం అవుతుంటారు. ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజా కార్యక్రమాలను వారు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా NBK అభిమాన సంఘం, NBK TRUST సంయుక్తంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను 5 రోజుల ముందు నుంచే జరుపుతున్నారు.
రెండవ రోజు అయిన నేడు ఎనుగొండ లోని అనాధ బాల బాలికల ఆశ్రమంలో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంచారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సేవలు అందిస్తున్ననందమూరి బాలకృష్ణ తమ అందరికి ఆదర్శనీయుడని వారు ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా NBK అభిమాన సంఘం అధ్యక్షుడు ఆర్. బాలప్ప, NBK ట్రస్ట్ అధ్యక్షుడు కుమార్, వెంకటయ్య, రషీద్ రహ్బార్, చెన్నయ్య, వెంకటేష్, సంపత్, గణేష్, కునాల్ పాల్గొన్నారు.