హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన సందర్భంగా కడప నగరంలోని ఓల్డ్ జిల్లా పరిషత్ నిరాశ్రయుల వసతి గృహంలో జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం సేవా కార్యక్రమాలు నిర్వహించింది.
జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యుడు పోతుగంటి పీరయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కడప నగరంలోని ఓల్డ్ జిల్లా పరిషత్ నిరాశ్రయుల వసతి గృహంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 20 కేజీల కేక్ కటింగ్ చేశారు. అనంతరం బియ్యం,చీరెలు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి,హరిప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న ఆర్యోక్తి ప్రకారం తెలుగు చలన చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటుడుగా కళాసేవ రాజకీయంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్తున్న మహానుభావుడు అన్నారు.
నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ ఆశయ సిద్ధికోసం అటు ప్రజా సేవ ఇటు కళాసేవ చేస్తున్నారని ఆయన నిండు నూరేళ్లు జీవించాలి భగవంతుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు రమణ,ఇబ్రహీం,ప్రసాద్ నాయుడు,చికెన్ బాషా టీడీపీ నాయకులు దుద్ద్యాల జయచంద్ర,గన్నేపాటి మల్లేష్, సుధాకర్ యాదవ్, కార్యకర్తలు సురేష్,కొమ్మలపాటి, ఖాసిం,అమీర్,విక్రమ్ మహిళా నాయకులు మీనాక్షి,స్వర్ణ,నిర్మల తదితరులు పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.