కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో,రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం కువైట్ ఎన్టీఆర్ సేవా సమితి బాలరెడ్డెయ్యనాయుడు సహకారంతో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పేదలకు అన్న వితరణ గావించారు.ఇటీవల కోవిడ్ మూలం ఇబ్బందులు పడుతున్న వారికి వరుసగా మూడు సార్లు కువైట్ ఎన్టీఆర్ సేవా సమితి అద్వర్యం రాజంపేట లో అన్న వితరణ గావించి పలువురి ప్రసంశలు పొందారు.తిరిగి
నందమూరి బాలక్రిష్ణ పుట్టిన రోజు సందర్భంగా వాసుదేవ రాజు,దుగ్గినేని చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కేశవ,నరేష్,ఉపేంద్ర ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గంలోని పట్టణంలో సాయంత్రం 6:30pm నుండి కొత్త బస్టాoడ్, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో,మారుతి లాడ్జి దగ్గర,పాతబస్టాoడ్ సమీపంలో వుండే యాచకులకు,పుట్ పాత్ మీద వున్న వారికి అన్నదాన కార్య క్రమంను నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పట్టణంలో ని పేదలకు వివిధ ప్రాంతాల్లో ఆహార పొట్లాలును పేదలకు రైల్వేకోడూరు యన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.